పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , జ్యోతికృష్ణ( Pawan Kalyan, Jyothi Krishna ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై( Harihara Veeramallu ) ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీన ఈ సినిమా కచ్చితంగా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే ఈ సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమాలో ఒక యాక్షన్ సీన్ ను రూపొందించే బాధ్యత పవన్ తీసుకున్నారని ఆయన తెలిపారు.ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీన్లు ఉన్నాయని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు.20 నిమిషాల పాటు ఉండే సీక్వెన్స్ ను పవన్ రూపొందించారని తెలుస్తోంది.ఇది ఎంతో ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు.ఈ సీక్వెన్స్ లో 1100 మంది పాల్గొన్నారని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో 61 రోజుల పాటు ఈ సీక్వెన్స్ ను షూట్ చేశామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ దీని కోసం ఎంతో కష్టపడ్డారని గ్రౌండ్ వర్క్ చేశారని ఇంటర్నేషనల్ రేంజ్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో( international range stunt choreographer ) చర్చించారని చెప్పుకొచ్చారు.సినిమా మొత్తంలో ఇదే హైలెట్ కానుందని పేర్కొన్నారు.ఈ సినిమా కోసం పవన్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నట్టు జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు.పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండటం గమనార్హం.

హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.దాదాపుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయనే సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.పవన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.