అతి త్వరలో రూ.3 వేలకే టోల్ పాస్.. ఇక ఏడాది పొడవునా?

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వం, తాజాగా వాహనదారులకు మరింత సౌలభ్యం కలిగించే దిశగా ముందడుగు వేసింది.ఇప్పటివరకు అమలవుతున్న FASTag టోల్ విధానానికి మెరుగైన ప్రత్యామ్నాయంగా టోల్ పాస్, GPS ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

 Will The Toll Pass Be Available For Rs. 3,000 Very Soon, Or Will It Be Available-TeluguStop.com

ఈ విధానం ఒకవైపు వాహనదారులకు ఊరటను కలిగిస్తే, మరోవైపు ట్రాఫిక్‌కు కూడా శాశ్వత పరిష్కారం చూపనుంది.

ప్రస్తుతం ఉన్న FASTag ద్వారా వాహనదారులు ప్రతి టోల్ ప్లాజా వద్ద డబ్బు చెల్లించాల్సి వస్తోంది.

వంద కిలోమీటర్లకు ఒకసారి టోల్ గేట్ ఎదురవుతున్న పరిస్థితిలో, తరచూ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.దీనికి పరిష్కారంగా ప్రభుత్వం కొత్తగా “సంవత్సర టోల్ పాస్” అనే విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది.ఈ టోల్ పాస్‌ను రూ.3,000కి అందించాలనే యోచనలో ఉంది.ఒకసారి చెల్లించిన తర్వాత, ఆ వాహనానికి సంవత్సరం పొడవునా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఆపకుండా ప్రయాణించగలిగే సౌలభ్యం లభిస్తుంది.

Telugu Annual Toll, Expressway Ups, Gps Toll, Highway Travel, India Roads, Infra

ఈ కొత్త విధానంలో భాగంగా శాటిలైట్ GPS( Satellite GPS ) ఆధారిత టోల్ సిస్టమ్ ను కూడా అమలు చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari )నిర్ణయించారు.ఈ విధానం ద్వారా మీ వాహనం ఎంత దూరం ప్రయాణించిందో GPS సాంకేతికత ద్వారా లెక్కించి, అదే మేరకు డబ్బులు మీ FASTag ఖాతా నుంచి కట్ చేయనున్నారు.ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ GPS టోల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.ఇది పూర్తిగా అమలులోకి వస్తే, వాహనదారులకు మరింత సౌకర్యంగా మారనుంది.

ఇక టోల్ ప్లాజాల వద్ద నిలిపివేసే అవసరం లేకుండా ప్రయాణం సాగుతుంది.

Telugu Annual Toll, Expressway Ups, Gps Toll, Highway Travel, India Roads, Infra

అయితే ఈ కొత్త విధానం అమలులోకి రావడంలో కొన్ని సవాళ్లు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితిలో పలు జాతీయ రహదారులు పిపిపి మోడల్లో నిర్మించబడ్డాయి.అంటే ప్రైవేట్ కంపెనీలు నిర్మాణం( Construction of private companies ) చేసి, టోల్ ద్వారా తమ పెట్టుబడి తిరిగి పొందే విధంగా ఒప్పందాలు ఉన్నాయి.వీటిని పరిగణనలోకి తీసుకుని, GPS టోల్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

మొత్తానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న టోల్ పాస్, GPS ఆధారిత టోల్ కలెక్షన్ విధానాలు ప్రయాణికులకి వేగవంతమైన, అవాంతర రహితమైన ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఉన్నాయి.ఇది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా రవాణా రంగంలో పెద్ద మార్పు తీసుకురావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మార్పులు త్వరలోనే అధికారికంగా అమలులోకి వస్తాయని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube