ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సీసీ కెమెరా ఫుటేజీలు, షార్ట్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇందులో కొన్ని సంఘటనలు గుండెను కదిలించే విధంగా ఉంటాయి.
మనుషులపై మనుషులే అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరు చూసినప్పుడు సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు తలెత్తడం సహజం.తాజాగా బెంగళూరు సమీపంలోని ఓ పునరావాస కేంద్రంలో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఘటన బెంగళూరు(Bengaluru) నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని నెలమంగళ గ్రామీణ(Nelamangala Rural) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ రిహెబిలిటేషన్ సెంటర్లో చోటు చేసుకుంది.అక్కడ చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు.వీడియో ప్రకారం, అతనిని ఒక గదిలో బంధించి పదే పదే కర్రలతో కొడుతూ, ఈడ్చుకుంటూ వెళ్లిన దృశ్యం నమోదైంది.రోగి ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు.తీవ్రంగా గాయపరిచే స్థాయిలో దాడి చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(social media) వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇంత ఘోరంగా ఉంరేంట్రా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.బాధితుడిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని వారిపై సుమోటో కేసు నమోదు చేశారు.ప్రాథమిక విచారణలో.వార్డెన్ ఒక వ్యక్తిని బాత్రూములు, దుస్తులు శుభ్రం చేయమని చెప్పినట్టు, అయితే రోగి నిరాకరించడంతో వార్డెన్ మరొకరితో కలిసి అతనిపై దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.
శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ విధమైన అమానుష ప్రవర్తన అస్సలు సమంజసం కాదు.ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం సమాజం అంతా కలసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.