ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు అనేకం చూస్తున్నాం.వాటిలో కొన్ని వినోదాన్ని పంచినా, మరికొన్ని హృదయ విదారకమైన ఘటనలను చూపిస్తున్నాయి.
ముఖ్యంగా సీసీ కెమెరాలో(CCTV) రికార్డ్ అయిన సంఘటనలు చూస్తే.జీవితం ఎంత అస్థిరమో, మరణం ఎంత అకస్మాత్తుగా వచ్చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది.
తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే, ఢిల్లీ నగరంలోని చందర్ విహార్ (Delhi incident, Chander Vihar)అనే ప్రాంతంలో శుక్రవారం(Friday) రోజు ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
రాత్రి సమయంలో ఓ వీధిలో పాదచారులు సాదారణంగా వెళ్తుండగా, ఒక్కసారిగా ఓ పాత భవనం గోడ శిథిలమై కుప్పకూలింది.ఈ ప్రమాదంలో చందర్ పాల్ అనే 67 ఏళ్ల వృద్ధుడు అక్కడే నడుస్తూ ఉండగా, ఆ గోడ శిథిలాలు అతని మీద పడిపోయాయి.
ఒక్కసారిగా భారీ శబ్ధంతో రాళ్లు అతని మీదకి పడటంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు.అటుగా వెళ్తున్న ఇతరులు భయంతో పరుగులు తీశారు.గోడ శిథిలాలపై మరొకరు పరిశీలించడానికి వచ్చిన సమయంలో అతనిమీద కూడా కొన్ని రాళ్లు పడినట్లు వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనలో మరికొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అయితే, చందర్ పాల్ అక్కడికే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీలో(CCTV) రికార్డయింది.ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.