వైయస్ వివేక హత్య కేసులో జగన్ ప్రస్తావనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయం సీఎం జగన్కు ముందే తెలుసు అని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ క్రమంలో సీబీఐ అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించటం సంచలనం సృష్టించింది.వివేకానంద రెడ్డి మృతి జగన్మోహన్ రెడ్డికి అదే రోజు ఉదయం 6:15 నిమిషాలకే తెలుసని వెల్లడించారు.వివేక అప్పటి పీఏ కృష్ణారెడ్డి చెప్పక ముందే జగన్ కు తెలిసిందని పేర్కొన్నారు.

అయితే వివేకా హత్య కేసులో జగన్ ప్రస్తావన రావటంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.వివేక హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం.హత్య గురించి జగన్ కు ఉదయం ఆరు గంటలకు ముందే తెలుసు అని సీబీఐ స్పష్టం చేసింది.

ఈ కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారు.అంతఃపుర కుట్ర బయటపడుతుందనే అవినాష్ ను ఇన్నాళ్లు అరెస్టు కాకుండా చూశారు.

సీబీఐకి సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు అని టీడీపీ పోలీట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube