టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన రసవసగా మారడం తెలిసిందే.ఏకంగా పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించడం జరిగింది.
ఈ క్రమంలో పోలీసులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది.అయితే తన కాన్వాయ్ మొత్తం పోలీసుల అడ్డుకోవడంతో దాదాపు 7 కిలోమీటర్లు నడిచి అనపర్తిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.
ఈ ఘటనపై పోలీసులు చంద్రబాబుపై పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోడీకి లెటర్ రాశారు.చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ లేఖలో తెలిపారు.నిన్న చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనలను ప్రస్తావించారు.
ముఖ్యంగా చంద్రబాబుని పోలీసుల అడ్డుకున్న తీరును ప్రస్తావించడం జరిగింది.దీనిపై వెంటనే స్పందించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది.
చంద్రబాబు భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు.