టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు.సీఎం జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతానని తెలిపారు.
ఈడీ, సీబీఐ అధికారులకు భయపడి ఢిల్లీలో తలవంచారని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని ఎద్దేవా చేశారు.
పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంత అనేది చర్చకు వస్తోందన్నారు.రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.