తెలంగాణ రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా విమర్శల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కెసీఆర్ ను అధికారంలో నుండి దింపివేయాలనే ఉద్దేశ్యంతో అందరూ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నా అందరి టార్గెట్ మాత్రం కెసీఆర్ ను ప్రగతిభవన్ ఖాళీ చేయించడం.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగా రాజకీయ పరిస్థితులు రణరంగంగా మారుతున్న పరిస్థితుల్లో కెసీఆర్ మాత్రం చాలా మౌనం వహిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో ఏ రాజకీయ నేతయయినా కనీసం స్పందిస్తారు.
అయితే కెసీఆర్ మాత్రం స్పందించకపోవడంతో వ్యూహం అంతుపట్టకుండా ఉందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
అయితే ఎంతగా కెసీఆర్ వ్యతిరేక పరిస్థితులు ఉన్నా కెసీఆర్ స్పందించకపోవడంతో భవిష్యత్ రాజకీయ వ్యూహం పట్ల చాలా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం ఎంతగా తమ అనుకూల పరిస్థితులు లేకున్నా తాము చేయాలనుకున్న వాటిని ఎవరి విమర్శలను లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అయితే కెసీఆర్ మాత్రం ఇక రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా కెసీఆర్ తీసుకునే నిర్ణయాలను బట్టి బీజేపీని అడ్డుకోవటంపై కెసీఆర్ దృష్టి సారిస్తారా లేక కాంగ్రెస్ ను అడ్డుకోవటంపై దృష్టి సారిస్తారా అన్నది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న వ్యతిరేకత ను ఎలా కెసీఆర్ తనకనుకూలంగా మార్చుకుంటారు, మరల అధికారం సాధించే దిశగా ఎలా ముందడుగు వేస్తారు అన్నది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ.ఏది ఏమైనా కెసీఆర్ బీజేపీ వ్యతిరేక ఎజెండా గానే ముందుకు సాగుతుండటంతో ఇక వచ్చే ఎన్నికల వరకు ఇదే ఎజెండాగానే ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.







