రాజస్థాన్ పర్యాటకం ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది, అందుకే భారతదేశానికి వచ్చే ప్రతి ముగ్గురు విదేశీ పర్యాటకులలో ఇద్దరు ఖచ్చితంగా రాజస్థాన్ సందర్శిస్తారు . జైసల్మేర్ రాజస్థాన్లోని ఒక పర్యాటక ప్రదేశం, దీనిని స్వర్ణనగరి అని కూడా అంటారు.
ఇక్కడ లభయ్యమయ్యే పసుపు రాయికి దేశ విదేశాల్లో కూడా ఎంతో గుర్తింపు ఉంది.జైసల్మేర్ నుండి 50 కి.మీ దూరంలో ఉన్న హబర్గావ్లో ఈ రాయి కనుగొన్నారు.ఈ రాయి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఈ రాయి పాలను పెరుగుగా మారుస్తుంది.ఇక్కడి ప్రజలు పాలను పెరుగుగా మార్చేందుకు వందల సంవత్సరాలుగా ఈ అద్భుత రాయిని ఉపయోగిస్తున్నారు.
ఈ గ్రామం పేరు హబూర్ అయినప్పటికీ, ప్రస్తుతం దీనిని పూనంనగర్ అని పిలుస్తారు.
ఈ రాయిని స్థానిక భాషలో హబురియా భాటా అని కూడా అంటారు.
ఈ రాయి దాని ప్రత్యేక లక్షణం కారణంగా దేశ, విదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందింది.ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమతో పాటు హబూర్ రాయితో చేసిన పాత్రలను తీసుకెళ్తారు.
ఈ రాయితో చేసిన పాత్రలకు ఇక్కడ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.కొన్ని పరిశోధనలలో.
పెరుగును తయారు చేయడానికి అవసరమైన రసాయనాలు ఈ రాయిలో ఉన్నాయని కనుగొన్నారు.ఈ రాయిలో అమైనో ఆమ్లాలు, ఫెనిలాలనైన్, రిఫాఫెన్ టైరోసిన్ ఉన్నాయి.
ఈ రసాయనాలు పాలను పెరుగుగా మార్చడంలో సహాయపడతాయి.అంతే కాదు ఈ రాయితో చేసిన పెరుగు తియ్యగా, సువాసనతో కూడి ఉంటుంది.
ఈ రాయితో చేసిన పెరుగు, లస్సీలను చూసి దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఆశ్చర్యపోతారు.