సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి వ్యవహారం తరచూ చర్చలకు దారితీస్తున్నవిషయం విధితమే.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలుమార్లు అధినాయత్వానికి లేఖలు రాసినట్టు, ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పడుతున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ మారి పోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని టాక్ వచ్చింది.దీంతో పలువురు నాయకులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించినట్టు తెలిసింది.
కాంగ్రెస్లో జగ్గారెడ్డి వివాదం కొనసాగుతుండంగానే జగ్గారెడ్డి తన అనుచరులతో భేటీ అవ్వడం చర్చకు దారితీస్తోంది.
కార్యకర్తల భేటీలో ఆయనకు ఓ విషయం తెలిసినట్టు ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్లోనే ఉండాలని తేలినట్టు కనిపిస్తోంది.కాగా కార్యకర్తలు కాంగ్రెస్లోనే ఉండాలని, లేదంటే తాము జగ్గారెడ్డి వెంట వెళ్లం అని తేల్చి చెప్పారట.
ఉంటే కాంగ్రెస్లోనే ఉండాలి లేదంటే మీరు టీఆర్ఎస్లో చేరినా ? ఇండిపెండెంట్గా పోటీ చేసినా బీజేపీలో చేరినా జగ్గారెడ్డి వెంట నడిచే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని టాక్.ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో కొచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలిసికట్టుగా ముందుకెళ్లాలని, ఇందుకు తాము కృషి చేస్తామని కార్యకర్తలు చెప్పినట్టు తెలిసింది.
ఇది కాదని కాంగ్రెస్ను చీల్చే ప్రయత్నాలకు పూనుకుంటే సహించబోమంటూ చెప్పారట.ఇతే ఇప్పుడు కాంగ్రెస్లో రసవత్తరంగా మారింది.
ఇటీవల తరచూ వస్తున్న జగ్గారెడ్డి వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందిస్తూ వస్తున్నాడు.పార్టీ దృష్టికి వచ్చిందని, సీనియర్ నేతలు అతనితో మాట్లాడుతున్నారని కూడా రేవంత్ చెప్పారు.ఈ క్రమంలోనే జగ్గారెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్లోనే ఉండాలంటూ బాహటంగా చెప్పడంతో ఆయన ఏమి చేస్తారో చూడాలి.ఏది ఏమైనా కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను మాదిరిగా రెచ్చిపోతున్న జగ్గారెడ్డి ఈ వివాదంలో కాస్త తగ్గితే మంచిదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.