టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాను త్వరగా పట్టాలు ఎక్కించాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.ఇకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ఎంపిక చేశారట.
అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రాధ.ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రాధ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించ నుందట.ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ఇప్పటికే మూవీమేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.తాజాగా ఈ సినిమాతో మరోసారి వెండితెరపై కి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో ఎక్కువగా సీనియర్ హీరోయిన్ లకు అవకాశాలు ఇస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తయ్య పాత్రలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ, అలా వైకుంఠపురం సినిమాలో టబుకు అవకాశాలు ఇచ్చారు.మరి రాధ ఈ సినిమాలో నటించ నుందా లేదా తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.