టాలీవుడ్ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది.టికెట్ల రేట్ల విషయం రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్దగా మారింది.
ఏపీలో అతి తక్కువ టికెట్ల రేట్ల వల్ల పెద్ద సినిమాలకు నష్టం.తెలంగాణలో అతి ఎక్కువ రేట్ల వల్ల చిన్న సినిమా లకు నష్టం.
ఈ విషమయై మాట్లాడేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు… కాని ఇండస్ట్రీ పెద్దగా ఈ విషయాన్ని ప్రభుత్వాలతో చర్చించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.ఇండస్ట్రీ లో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు.
కాని ఇప్పటి వరకు ఈ విషయంలో గట్టిగా మాట్లాడేవారే లేక పోయారు.ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు.
చిరంజీవి ఇటీవల మాట్లాడుతూ తాను ఏదైనా సమస్య ఉంటే స్పందిస్తాను కాని దాని గురించి మాట్లాడుతాను కాని.పెద్దన్న పాత్ర ను మాత్రం పోషించేందుకు ఆసక్తి లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఎలాగూ చిరంజీవి పెద్దన్న పాత్ర ఇష్టం లేదు అన్నాడు కనుక తాను ఆ పాత్ర పోషిస్తాను అన్నట్లుగా మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.తాజాగా మోహన్ బాబు ఒక లేఖ రాశాడు.
ఇండస్ట్రీలో సమస్యలు చాలా ఉన్నాయి.వాటిని అందరం కలిసి పరిష్కరించుకోవాలి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
సుదీర్ఘమైన ఆయన లేఖ లో ఒక్క పాయింట్ అయినా బాగా లేదు అన్నట్లుగా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
అందరం కలిసి పోరాటం చేద్దాం అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు.మోహన్ బాబు పెద్దరికం తీసుకోవాలని ప్రయత్నించినా ఆయన్ను పెద్దగా ఒప్పుకునేందుకు ఏ ఒక్కరు ఆసక్తిగా లేరు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు ముందు ముందు మరేం చేస్తాడో చూడాలి.
ఆయన కనుక ఈ టికెట్ల రేట్ల విషయంలో ఒక క్లారిటీ తీసుకు వచ్చి ఏపీ ప్రభుత్వం తో మాట్లాడితే ఆయన్ను అప్పుడు గౌరవిస్తారేమో చూడాలి.