తాజాగా ఓ పెళ్ళైన కొత్తజంట మండుటెండలో పెళ్లి బట్టలలో బైక్ పై గుడికి వెళ్తున్నారు.అయితే అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ ఎమ్మెల్యే తన కారులో వారికి లిఫ్ట్ ఇచ్చి న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఎమ్మెల్యే వధూవరులను తన కారులో ఎక్కించుకొని వారి ఇంటి వద్ద దింపడం జరిగింది.ఈ సంఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రంలోని రాజ్ ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే అయిన జయవర్ధన్ సింగ్( Jaivardhan Singh ) తన తండ్రి సింగ్ ఎన్నికల ప్రచారం కోసం బిజీగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలోనే బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన తన కారులో తిరిగి ఇంటికి ప్రయాణిస్తున్నారు.కాగా మార్గమధ్యంలో మండుటెండలో బైకుపై అప్పుడే కొత్తగా పెళ్లయిన జంటను ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్ గమనించారు.దీంతో భారీ వెళ్తున్న బైక్ పై ముందుకు వెళ్లి కారును ఆపాలని డ్రైవర్ కి చెప్పారు.
ఆ తర్వాత వధువు( Bride )ను తన సోదరిగా పేర్కొన్న ఎమ్మెల్యే ఆమెకి ఇలాంటి అసౌకర్యం కలిగించవద్దని వరుడుతో చెప్పి వారిని తమ కారులో కూర్చోవాలని జంటను కోరాడు.
గుడిని సందర్శించి ఎండలో వెళ్తున్న ఈ కొత్త దంపతులు బైక్ దిగి ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్ కోరిక మేరకు ఆయన కారులో వెనుక సిటీలో కూర్చొని వారి ఇంటి వద్దకు వెళ్లారు.ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత స్వయంగా ఎమ్మెల్యే కారు డోరు తీసి ఆ కొత్త జంటకు స్వాగతం పలకడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.నూతన వధూవరులు ఇద్దరు ఖరీదైన ఫార్చునర్ కారు నుంచి దిగడం చూసిన కుటుంబ సభ్యులందరూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది
.