బతికివుండే పురుగుల్ని మీరు ఎప్పుడన్నా తిన్నారా? అదేంటి అసహ్యం అని అనుకుంటున్నారా? పోనీ అలా తినవారిని ఎపుడైనా చూసారా? చూడడం కష్టమే కదూ.ఎందుకంటే ఇక్కడ అది దాదాపుగా అసాధ్యం.
అయితే సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో జరిగే వింతలన్నీ తేలికగా తెలుసుకొనే వెసులుబాటు కలిగింది.కొన్నిసార్లు కొన్ని రకాల వీడియోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతుంటారు.
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దాంతో దానిని చూసిన నెటిజనం అవాక్కవుతున్నారు.ఓ రకంగా చెప్పాలంటే వారు షాక్ అవుతున్నారు అని చెప్పుకోవాలి.అవును, ఎప్పుడైన మనం తింటున్న ఆహారంలో చిన్న పరుగులాంటిది కనిపిస్తే ఇక ఆ ఫుడ్ తినటానికి మనం సంశయిస్తాము.
వండేవారిని తిట్టుకుంటాం కూడా.ఒక్కోసారి వారిమీద కంప్లైంట్ ఇస్తాం.
ఎందుకంటే పురుగులు పడిన ఆహారం తింటే రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆందోళన పడిపోతుంటాం.కానీ, ఇక్కడ ఇద్దరు చిన్నారులు మాత్రం ఏకంగా బతికున్న పురుగుల్ని( Insects ) ఏరుకుని అమాంతంగా తినేస్తున్నారు.
ఈ వీడియో మీరు చూశారంటే బిత్తరబోవలసిందే.వైరల్గా మారిన వీడియోలో ఒక అక్కా తమ్ముడు ఒక పొలంలో కూర్చుని తమ ముందు కనిపిస్తున్న రెక్కల పురుగులను లొట్టలేనుకొని తినడం మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.పొలంలో ఒకే చోట అనేక కీటకాలు ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది.ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ ఇద్దరు పిల్లలు బతికి ఉన్న కీటకాలను సజీవంగానే తినడం.ఈ చిన్నారుల ముఖాలను బట్టి వారు జపాన్( Japan ) వాసులుగా చెప్పుకోవచ్చు.
అయితే ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు ఇంకెవరికుంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.