బీహార్లో మద్యపాన నిషేధ సవరణ బిల్లు త్వరలో చట్టం రూపంలోకి రానుంది.బీహార్ శాసనసభ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, ఇప్పుడు ఈ చట్టం గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రంలో అమలులోకి వస్తుంది.
దీంతో పాటు తొలిసారి మద్యం సేవించి పట్టుబడితే నిందితులు రెండు నుంచి ఐదు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైంది.అయితే ఎవరైనా తొలిసారి మద్యం సేవించినట్లు సమాచారం ఎలా అందుతుందనే ప్రశ్న చాలామందిలో నెలకొంది.
ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తోంది.మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తి మొదటిసారిగా మద్యం సేవించాడనే ఆరోపణపై పట్టుబడ్డాడో లేదా రెండోసారి పట్టుబడ్డాడో అతని బొటనవేలు ముద్ర తెలియజేస్తుంది.
ఇందుకోసం మద్యం సేవించి పట్టుబడిన నిందితులందరి పూర్తి రికార్డును అందేబాటులో ఉంచుతారు.
క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపిన వివరాల ప్రకారం, ఎవరైనా మద్యం సేవించి పట్టుబడితే పోలీసులు నూతన సాఫ్ట్వేర్లో అతని ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్, బొటనవేలు ముద్రను ఫీడ్ చేస్తారు.
సాఫ్ట్వేర్లో నమోదైన రికార్డుల ఆధారంగా పట్టుబడిన మద్యం బాబుల ఆటకట్టించనున్నారు.ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎవరైనా గతంలో మద్యం తాగినదీ లేనిదీ ఇట్టే తెలిసిపోతుంది.మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తి మొదటిసారిగానో, రెండోసారిగానో పట్టుబడ్డాడా, అతని శాశ్వత చిరునామా ఏంటనేది కూడా పోలీసు స్టేషన్లోనే తెలిసిపోతుంది.పోలీస్ స్టేషన్ దాని పరిధిలో నివసిస్తున్న మందుబాబుల పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచుతుంది, దీనిని సీడీ స్లిప్ అంటారు.
నిందితుడు నేరం చేస్తూ పట్టుబడిన ప్రాంతంతో సంబంధం లేకుండా, ఆ స్థల పోలీసులు అతని శాశ్వత చిరునామా ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తారు.ఆ నిందితుడి సీడీ స్లిప్ ఆధారంగా అతడిని సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలిస్తారు.