ప్రజలకు డబ్బు పిచ్చి పట్టింది అంటూ కర్ణాటక సీఎం కొడుకు సంచలన వ్యాఖ్యలు..!!

ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) జరిగిన సంగతి తెలిసిందే.హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది.

 Sensational Comments Of Karnataka Cm Son Saying That People Have Gone Mad, Congr-TeluguStop.com

ఈ ఎన్నికలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మంచి పోటీ నెలకొంది.ప్రధాని మోదీ సైతం గతంలో ఎన్నడూ లేని రీతిలో కర్ణాటక రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభలలో ర్యాలీలలో పాల్గొన్నారు.

అయినా గాని కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజలు పట్టం కట్టారు.ఇదిలా ఉంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు యాతింద్ర సిద్ధరామయ్య( Yathindra Siddaramaiah )… సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు డబ్బు పిచ్చి పట్టింది అని వ్యాఖ్యానించారు.

తన తండ్రి సిద్ధరామయ్య గెలుపు కోసం భారీగా ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో కాంగ్రెస్( Karnataka Congress ) గెలవడానికి చాలా కష్టపడటం జరిగింది.ఈ క్రమంలో అందరిలాగే మా నాన్న కూడా ఓటర్లకు కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, గడియారాలు పంచారు.

కానీ ఓటర్లు వస్తువులు వద్దు డబ్బులే కావాలని డిమాండ్ చేశారు.ప్రజలకు డబ్బు పిచ్చి చాలా పట్టింది… ఇచ్చింది తీసుకోరు అంటూ సీరియస్ గా వ్యాఖ్యానించారు.

దీంతో యాతింద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube