వినియోగదారులకు షాక్..వడ్డీ రేటు పెంపునకు ఎస్బీఐ నిర్ణయం

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది.అన్ని రుణాలపై వడ్డీ రేట్లు పెంపునకు నిర్ణయం తీసుకుంది.

 Sbi's Decision To Increase Interest Rate Is A Shock To Consumers-TeluguStop.com

ఈ మేరకు పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.

ఎస్బీఐ తాజా నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో పాటు గృహ రుణాలు పొందిన వారికి అదనపు భారం పడుతుంది.

కాగా ఎస్బీఐ ఓవర్ నైట్ ఎంసీఎల్ రేటును 10 బీపీఎస్ పాయింట్లు పెంచింది.దీని కారణంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది.ఫలితంగా నెలకాల రుణాలపై వడ్డీ రేటు 8.10 శాతానికి పెరిగింది.అదేవిధంగా సంవత్సర కాల వ్యవధిలో రుణాలపై కొత్త రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి… రెండేళ్ల కాలానికి 8.50 నుంచి 8.60 శాతానికి పెరిగిందని బ్యాంకు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube