ప్రస్తుత కాలంలో టాక్ షోలు హిట్ కావడం కష్టమవుతోంది.పెద్దపెద్ద టీవీ ఛానెళ్లు టాక్ షోలను ప్రసారం చేస్తున్నా ఆ షోలకు సరైన రేటింగ్స్ రావడం లేదు.
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో అంటూ వార్తలు వచ్చిన సమయంలో ఆ టాక్ షో క్లిక్ కాకపోవచ్చని చాలామంది అనుకున్నారు.బాలయ్యకు సైతం గతంలో రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం లేదు.
అయితే బాలయ్య హోస్ట్ గా మోహన్ బాబు గెస్ట్ గా ప్రసారమైన తొలి ఎపిసోడ్ తోనే ఆ అనుమానాలు అన్నీ పటాపంచలయ్యాయి.టాక్ షోలకు బాలయ్య తాను పర్ఫెక్ట్ హోస్ట్ అని ఈ షో ద్వారా ప్రూవ్ చేసుకున్నారు.
ఆహా ఓటీటీకి ఈ షో స్టార్ట్ అయిన తర్వాతే ఊహించని స్థాయిలో సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని ఆహాకు భారీగా లాభాలు రావడానికి ఒక విధంగా బాలయ్య కారణమయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ షోను ఈ స్థాయిలో హిట్ చేసిన బాలయ్య ఈ షో కోసం తీసుకున్న పారితోషికం మాత్రం కేవలం 2.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.గతంలో బాలయ్య ఈ షో కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని ప్రచారం జరిగినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
ఎపిసోడ్ కు పాతిక లక్షల రూపాయల చొప్పున పది ఎపిసోడ్లకు టాక్ షో హోస్ట్ గా చేయడానికి ఈ ఒప్పందం జరిగిందని బోగట్టా.
అయితే అన్ స్టాపబుల్ సీజన్ 1 సక్సెస్ కావడంతో తర్వాత సీజన్ కు బాలయ్య ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది.
మరోవైపు బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా చేస్తున్నారని సమాచారం.ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు ఈ షో హిట్ కావడానికి బాలయ్య కూతురు ఇచ్చిన క్రియేటివ్ ఐడియాలు కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.