లోకంలో కామంతో ఊగిపోయే వారు కుక్కలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని అక్కడక్కడ జరిగే ఘటనలు నిరూపిస్తున్నాయి.ఇక సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో ఎన్ని రకాలుగా అవగహన కల్పిస్తున్నా, చట్టం ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్న ఈ దారుణాలు ఆగడం లేదు.
ఆకలి వేస్తే గుర్రం అరిగడ్ది మేసినట్లుగా, కామ వాంఛలు తీర్చుకోవడానికి కొందరు నీచులు పవిత్ర స్దలాలను కూడా అపవిత్రం చేయడానికి వెనుకాడటం లేదు.ప్రస్తుతం ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే.
సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి తన కామ వాంఛ తీర్చుకోవడానికి మాయమాటలతో ఓ యువతిని వశపరచుకుని, ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లాడట.
అక్కడ ఆ యువతిని నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడట.అప్పటికే ఆ యువతి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని వెతికే పనిలో పడ్డారట.
ఇంతలో ఆ కామాంధుని బారినుండి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులుకు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందట.కాగా అత్యాచారం కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇక పవిత్రమైన ప్రార్థనా మందిరంలో ఈ దారుణం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు, వీడిది ఒక పుట్టుకేనా ఇంత కామం దేనికిరా అంటూ నిందిస్తున్నారట స్దానికులు.