ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.డిసెంబర్ 2022తో మూడో త్రైమాసికం ముగియగా… ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.29,175 కోట్ల లాభంతో 65 శాతం వృద్ధి సాధించాయి.
మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,729 కోట్ల లాభాలు నమోదు చేశాయి.అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 139 శాతానికి పెరిగి రూ.775 కోట్లు కాగా… యూకో బ్యాంకు రూ.653 కోట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది.