ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో స్పందించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.

 Prajavani Applications Should Be Resolved Promptly: District Additional Collecto-TeluguStop.com

ఖీమ్యా నాయక్ లు ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వచ్చిన 12 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులకు స్పందించి ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ – 4, డీపీవో – 2,సర్వే – 1,ఎంప్లాయిమెంట్ ఆఫీస్ – 1,డి ఆర్ డి ఓ – 1,ఎస్ డి సి – 1,డి ఎం ఎచ్ ఓ – 1,అగ్రికల్చర్ ఆఫీస్ – 1, మొత్తం – 12 దరఖాస్తులు స్వీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube