రేవంత్ రెడ్డి వాక్యాలను వక్రీకరించారంటూ కాంగ్రెస్ ఆందోళన.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట సబ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.

 Congress Is Concerned That Revanth Reddy's Sentences Have Been Distorted, Congre-TeluguStop.com

దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా భారీగా మోహరించిన పోలీసులు( Police ) అడ్డుకున్నారు.అనంతరం సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.

రాష్ట్రంలో రైతులను ఉద్దేశించి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎకరాకు ఒక గంట చొప్పున నాణ్యమైన విద్యుత్ అందించాలని మాట్లాడిన మాటలను అధికార పార్టీ నాయకులు వక్రీకరించారని అన్నారు.

విద్యుత్ డిస్కములకు వేలకోట్ల బకాయి పడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం ప్రజలంతా గమనించాలని కోరారు.

తాము నిరసన కార్యక్రమాలకు దిగితే పోలీసులను పెట్టి అడ్డుకోవడాన్ని ఖండించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత( Vanitha ), యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చిందం శ్రీనివాస్, రెడ్డిమల్ల భాను, , వంగ మల్లేషం గౌడ్,నాయకులు పట్టణ కార్యదర్శి వెంగల అశోక్, బాలకృష్ణయ్య, సానియా,తడక వెంకటేష్, నూనె శ్రీనివాస్,సంగం శ్రీనివాస్,మల్లికార్జున్.

బాలరాజు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube