వినియోగదారులకు పండగ స్టార్ట్ అయింది.ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కు బిగ్ బిలియన్ డేస్ సేల్ తాజాగా మొదలైన విషయం అందరికీ తెలిసినదే.
అయితే ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై ఎవరూ ఊహించనంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయి అన్న సంగతి మీరు తెలుసా? తెలియకపోతే ఓ లుక్కేయండి ఇక్కడ.లేటెస్ట్గా రిలీజైన ఓ కొత్త మొబైల్ను ఆఫర్స్తో రూ.399 ధరకే ఆఫర్ చేస్తోంది.మోటోరోలా ఇండియా ఇటీవల భారతదేశంలో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసింది.
ప్రపంచంలోనే తొలిసారి 200 మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా మొబైల్తో పాటు, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మోడల్ను రిలీజ్ చేసింది.ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా సేల్ ప్రారంభమైంది.
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేకతలు చూశారంటే మీరు దాన్ని కొనకుండా ఉండలేరు.ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్, 68W ఛార్జింగ్ సపోర్ట్, pOLED డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ధర రూ.42,999.కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది.లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ను కేవలం రూ.39,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.ఎక్స్ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.16,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.రూ.1,368 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ బిలియన్ డేస్ సేల్లో ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఏంటంటే… ఈ మొబైల్ను కేవలం రూ.399 ధరకే సొంతం చేసుకోవచ్చు.ఇందుకోసం కస్టమర్ల దగ్గర ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఉండాలి.రూ.399 చెల్లించి మిగతా మొత్తాన్ని ఫ్లిప్కార్ట్ కాయిన్స్తో సహా చెల్లిస్తే సరిపోతుంది.అయితే కస్టమర్ల దగ్గర కనీసం 39600 ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఉండాలి.మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్తో 6.55 అంగుళాల pOLED డిస్ప్లే ఉంది.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది.ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్తో పనిచేస్తుంది.ఇంకెందుకాలస్యం త్వరపడండి మిత్రులారా!
.