నందమూరి నటసింహం బాలక్రిష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండి తెరపై ఎప్పుడు కనిపిస్తాడో అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.అయితే, మోక్షజ్ఞ సినిమా కోసం సరైన ముహూర్తం కుదరలేదని టాక్.
ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.వాస్తవానికి బాలకృష్ణ పదునాలుగేండ్ల వయస్సులోనే బాలనటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ వయస్సు ప్రస్తుతం దానికి రెట్టింపు అయ్యింది.ఒక విధంగా చూస్తే స్టార్ హీరోల వారుసులు మోక్షజ్ఞ కంటే ముందే ఎంట్రీ ఇచ్చేశారు.
మనోడే చాలా లేట్ చేసినట్టు తెలుస్తోంది.కాగా, ప్రస్తుతం నందమూరి వారసుడికి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని తెలిసింది.
కానీ అతని ఆలోచన విధానాన్ని మార్చేసి సినిమాల్లో నటించడానికి కుటుంబీకులు, తండ్రి ఒప్పించినట్టు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.
నందమూరి బాలయ్య తనయుడు సినిమాల్లోకి వస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.
అతని మొదటి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారట.ఇదే విషయంపై బాలకృష్ణ చాలా మంది దర్శకులతో డిస్కషన్స్ చేస్తున్నారని తెలిసింది.ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ‘అనిల్ రావిపూడి’ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని బాలయ్య అనుకున్నట్టు తెగ టాక్ నడిచింది.కానీ, బాలయ్య తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు క్రిష్ చేతిలో తన కొడుకును పెట్టి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందించాలని చూస్తున్నారట.
ఇక కథ విషయానికొస్తే ‘ఆదిత్యా 999’అని ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తోంది.ఇది ఒకప్పుడు బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్ అనుకుంటున్నారు.సినిమా బాలయ్యకు హీరోగా, నటనా పరంగా మంచి పేరు తీసుకొచ్చింది.అయితే, ఆదిత్య 999 కథను బాలయ్యనే సొంతంగా రెడీ చేశారని అంటున్నారు కొందరు.ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించగా.ఆదిత్య 999ను కూడా ఆయనతో చేయించాలని బాలయ్య భావించారట…
కానీ ఆయనకు ఆరోగ్యం బాలేనందున దర్శకుడు క్రిష్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.ఈ మూవీలో నందమూరి బాలయ్య కూడా కీ రోల్ చేయనున్నారని టాక్.ఈ మూవీ కథ మొత్తం ఫ్యాంటసీతో కూడిన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది.
అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మోక్షజ్ఞ వెండి తెరపై కనిపించనున్నారు.