ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తోందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు మరియు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.
అయితే ఇప్పటికే కొంతమంది తమకు తోచినంత డబ్బుని విరాళాల రూపంలో ప్రకటిస్తుంటే మరి కొంతమంది మాత్రం తమ సేవలు రూపంలో సేవలందిస్తున్నారు.
తాజాగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మిస్ ఇంగ్లాండ్ భాష ముఖర్జీ తన మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కనపెట్టి మరీ తన దేశ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.
అయితే ఒకప్పుడు మోడలింగ్ తోపాటు వైద్యానికి సంబంధించిన చదువును కూడా పూర్తి చేసినటువంటి భాష ముఖర్జీ ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తన సేవలు అందిస్తోంది.
దీంతో దేశానికి చెందినటువంటి పలువురు ప్రముఖులు మరియు సినీనటులు భాషా ముఖర్జీ చేస్తున్నటువంటి సేవలను ప్రశంసిస్తున్నారు.
మరోపక్క ఈమె భారత సంతతికి చెందినటువంటి మహిళ కావడం విశేషం. అంతేకాక ఒకప్పడు తనని మిస్ ఇంగ్లాండ్ గా నిలిపినటువంటి తన దేశ ప్రజలకు తన సేవలు అందిస్తున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉందని, కానీ కరోనా వైరస్ చాలా ప్రమాదకారి అని, కాబట్టి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచిస్తోంది ఈ అమ్మడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా యునైటెడ్ కింగ్డమ్ లో ఇప్పటివరకు 81,422 కరోనా కేసులను గుర్తించగా ఇందులో 12వేల పైచిలుకు మంది మృతి చెందారు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ సోకినటువంటి వారిలో ఒక్కరు కూడా కోలుకోలేక పోయారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో అని.అందువల్ల వైద్యులు నిత్యం ప్రజలను సామాజిక దూరం పాటిస్తూ చేతులను శానిటైనర్లు, డబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.
అంతేగాక దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం, వంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.