హైదరాబాద్ మహానగరంలో కేబుల్ బ్రిడ్జి పక్కన ఫుడ్ స్టాల్( Food Stall ) నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీ( Kumari Aunty ) ని ఎన్నో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆమెను ఫేమస్ చేశారు.ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ పాపులర్ అవడంతో ఆమె బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది.
ఇలా ఈమె చేతివంట రుచి చూడటం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడటం ట్రాఫిక్ పోలీసులు ఈమె బిజినెస్ క్లోజ్ చేయించడం జరిగింది.
అనంతరం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సహాయంతో ఈమె తిరిగి తన ఫుల్ స్టాల్ ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలో ఈమెను కలిసి తనతో మాట్లాడటమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేశారు.
అయితే తాజాగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ వార్తలను కుమారి ఆంటీ ఖండించారు.
ఇకపోతే తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ ఉత్సవం( Bigg Boss Utsavam ) కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శ్రీముఖి( Sreemukhi ) వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇలా ఈ షూటింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఏదో పూట గడవడం కోసం బిజినెస్ చేసుకుంటూ ఉన్నటువంటి ఈమెను మీ షో కి పాపులారిటీ రావడం కోసం తనను తీసుకెళ్లారు.ఇలా ఇప్పటికే ఎంతోమందిని తీసుకెళ్లి వారిని గాలికి వదిలేసారు వీరి మాటలను నమ్మి మీరు మీ బిజినెస్ పాడు చేసుకోవద్దు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మన తెలుగు వాళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారని ఇప్పుడే అర్థమవుతుంది అంటూ
మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీని ఇలా బుల్లితెర కార్యక్రమంలో కి తీసుకువెళ్లి తనని సెలబ్రిటీని చేశారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక నెక్స్ట్ సీజన్లో ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటూ ఈ వీడియో పై నేటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.