వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రం అప్పట్లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే.ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.
ఆ ఫిల్మ్లో విలన్ రోల్ ప్లే చేసి వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. ఇక ఆ తర్వాత జేడీ చక్రవర్తి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి.పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన జేడీ చక్రవర్తి ఆ తర్వాత కాలంలో విలన్గా , సపోర్టింగ్ యాక్టర్గానూ నటించాడు.
తాను సినిమాల్లోకి రావడానికి చిరంజీవి ఇన్స్పిరేషన్ అని పేర్కొన్న జేడీ.తనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని తెలిపాడు.
ఇన్నేళ్లు వెండితెరపైన నటుడిగా కనిపించిన జేడీ చక్రవర్తి దర్శకుడిగా మారబోతున్నాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు.‘హోమం’ సినిమా ప్రొడ్యూసర్ కోనేరు కిరణ్ కుమార్ ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఆ సినిమా చాలా పెద్ద ప్రాజెక్టని పేర్కొన్నాడు.16 దేశాల్లో ఈ ఫిల్మ్ షూట్ చేయబోతున్నట్లు వివరించాడు.కరోనా నేపథ్యంలో చాలా చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ డిలే అయ్యాయి.కాగా, అందులో తమ సినిమా కూడా ఉందని జేడీ తెలిపాడు. 16 దేశాల్లో షూట్ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు జేడీ పేర్కొన్నాడు.
సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ 8 నెలల నుంచి జరుగుతున్నదని వివరించాడు.ఇక జేడీ చక్రవర్తి సినిమాల విషయానికొస్తే.జేడీ ప్రస్తుతం తెలుగు భాషతో పాటు ఇతర భాషల చిత్రాలపైన కూడా కాన్సంట్రేట్ చేస్తున్నాడు.
మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పలుచిత్రాల్లో నటిస్తున్నాడు.జేడీ తెలుగు ప్రేక్షకులకు చివరగా యంగ్ హీరో కార్తీకేయ ‘హిప్పీ’ సినిమాలో కనిపించాడు.
జేడీ చక్రవర్తి ప్రజెంట్ హిందీ ఫిల్మ్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.ఈ సినిమా ‘ఏక్ విలన్’ సినిమాకు సీక్వెల్.