జబర్దస్త్ యాంకర్ గా తెలుగు వారందరికి కూడా సుపరిచితురాలు అయిన జబర్దస్త్ ముద్దుగుమ్మ అనసూయ సినిమాల్లో నటిస్తూ రెండు పండవల ప్రయాణం చేస్తుంది.మొదట సినిమాల్లో అనసూయను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
కాని ఎప్పుడైతే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిందో అప్పటి నుండి ఆమె వెండి తెరపై వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.ఆమెకు అద్బుతమైన పాత్రను ఇచ్చిన సుకుమార్ మరోసారి ఆమెను సరైన పాత్రతో వాడుకునేందుకు సిద్దం అయ్యాడు.
రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప.అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా లో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుందనే విషయం ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆమె ఫస్ట్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది.
పుష్ప లో దాక్షాయని పాత్రలో అనసూయను చూపించబోతున్నట్లుగా సుకుమార్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించారు.
దాక్షాయని యొక్క లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు.సినిమాలో ప్రతి ఒక్కరు కూడా మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు.
బన్నీ.రష్మిక.
సునీల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా మాస్ గెటప్ లో కనిపించగా అనసూయ ఎలా కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా కనిపించి అందరికి కూడా ఒక రేంజ్ లో షా క్ ను ఇచ్చింది.అనసూయ ఇంతలా పుష్ప లో కనిపిస్తుందని ఊహించలేదు.
ఆ హెయిర్ స్టైల్ పాన్ నోట్లో బొట్లు మెడలో పాత తరం వారి నగలు చేతికి కడియాలు ఇలా ఆమె మేకోవర్ ఒక రేంజ్ లో ఉంది అనడంలో సందేహం లేదు.ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒకటికి రెండు మూడు సార్లు చూసేలా ఉన్నాయి.సుకుమార్ కు చేతులు ఎత్తి మరీ అనసూయ అభిమానులు దండం పెడుతున్నారు.అనసూయ లుక్ చూస్తుంటే విలన్ గా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.సినిమా విడుదల తర్వాత రంగమ్మత్త మర్చిపోయి దాక్షాయని అంటూ అనసూయను పిలుస్తారేమో చూడాలి.రెండు పార్ట్ లుగా పుష్ప విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండువ పార్ట్ లో కూడా ఈమె ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.