కొత్త దర్శకుడు ఒక్క హిట్ కొట్టగానే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంటారు.చిన్న విజయానికి వరుసుగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి.
కాని ఈమద్య కాలంలో కొందరు స్టార్ దర్శకుల పరిస్థితి చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది.ఎందుకంటే వారు ఇండస్ట్రీ హిట్ కొట్టినా కూడా తదుపరి సినిమా ను మొదలు పెట్టడానికి ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుంది.
రంగస్థలం సినిమా తో రామ్ చరణ్ కు సుకుమార్ ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చిన విషయం తెల్సిందే.రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ సినిమా ను మొదలు పెట్టడానికి రెండేళ్లకు ఎక్కువగానే తీసుకున్నాడు.
ఇప్పటి వరకు ఆయన తదుపరి సినిమాను విడుదల చేయలేదు.రంగస్థలం క్రేజ్ ను ఉపయోగించుకుని వెంటనే సినిమా చేస్తే బాగుండేది అంటూ అభిమానులు ఎంత మొత్తుకున్నా కూడా తాను అనుకున్న హీరో దొరికే వరకు వెయిట్ చేసి సినిమాను పట్టాలెక్కించాడు.
సుకుమార్ ఇప్పుడు పుష్ప సినిమా తో మరో ఇండస్ట్రీ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇదే పరిస్థితి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే ఎన్టీఆర్ తో ఈయన సినిమాను మొదలు పెట్టాలనుకున్నాడు.కాని కరోనా వచ్చి సినిమా ఆలస్యం అయ్యింది.ఆలస్యం మరీ ఎక్కువ అవుతుందని ఎన్టీఆర్ తో కాకుండా మహేష్ బాబుతో సినిమాను చేసేందుకు త్రివిక్రమ్ సిద్దం అయ్యాడు.
ఎన్టీఆర్ తో క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబుతో సినిమాను చేయాలనుకున్న త్రివిక్రమ్ కు మళ్లీ ఇబ్బంది తప్పడం లేదు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది ఆగస్టులోనే సినిమాను పట్టాలెక్కించాల్సి ఉన్నా కూడా మహేష్.
త్రివిక్రమ్ ఇంకా కూడా షూటింగ్ మొదలు పెట్టలేదు.సర్కారు వారి పాట సినిమా తో బిజీగా ఉన్న మహేష్ బాబు తదుపరి సినిమా కోసం త్రివిక్రమ్ కు డేట్లు ఎప్పుడు ఇచ్చేది క్లారిటీ లేక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.
ఈ సమయంలో మాకు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది అంటున్నారు.అంటే అల వైకుంఠపురం లో విడుదల అయ్యి రెండేళ్లు పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు కాబోతుంది.
మూడేళ్లకు సినిమా రాబోతుంది.ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకులు ఇలా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటే ఎలా అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.