భారత్ వెళ్ళిపోతాం...అమెరికాలో భారతీయుల గోడు..!!!

అమెరికాలో కరోనా ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్న విషయం విధితమే ఈ క్రమంలో అగ్ర రాజ్యంలో ఉండాలంటే భారతీయులు ఆందోళన చెందుతున్నారు.భారత్ ఎప్పుడు వెళ్లిపోతామోనని ఆశగా ఎదరు చూస్తున్నారు.ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 6.33 లక్షల మంది కరోనా బారిన పడగా 28 వేల మంది మృతి చెందారు.రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గటడం లేదు.దాంతో అమెరికాలోని భారతీయులలో ఆందోళన మరింత రెట్టింపయ్యింది.

 Americans, India, Lockdown May 3rd, Cargo Flights-TeluguStop.com

భారత్ రావాలన్నా లాక్ డౌన్ మే 3 వరకూ పొడిగించడంతో అప్పటి వరకూ రాలేని పరిస్థితి నెలకొంది.అయితే ప్యాసింజర్ విమానాలు ఆగిపోయినా కార్గో విమానాలు తిరుగుతున్న నేపధ్యంలో కొందరు భారతీయులు అందులో వెళ్లేందుకు అనుమతి ఇస్తారా అని అడుగుతున్నారు.

ఈ ఒక్క సంఘటన చాలు భారతీయల పరిస్థితి అమెరికాలో ఏ విధంగా ఉందనేది అర్థమవ్వడానికి.ఇదిలాఉంటే

Telugu Americans, Cargo Flights, India, Lockdown-

అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు అందరం ఒక విమానం ఏర్పాటు చేసుకుంటామని భారత్ లోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ని అభ్యర్దిస్తున్నారు.భారత్ అనుమతి ఇస్తే విమానం ఏర్పాటు చేసుకుని వెంటనే వచ్చేస్తామని భారతీయులు అంటున్నారు.వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయలు సైతం తమని భారత్ వచ్చేలా చేయాలంటూ కేంద్రానికి వినతులు పంపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube