తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు.. నలుగురు ఎమ్మెల్యేల చుట్టు బిగుస్తున్న ఉచ్చూ.. ?

బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కర్ణాటకలో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 Four Telangana Mlas Are In Suspecting In Links With Bangalore Drugs Case ,telang-TeluguStop.com

కాగా కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకుని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.కాగా డ్రగ్స్ కేసుకు హైదరాబాద్‌తో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఇక్కడి పోలీసులు ఉన్నారట పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇస్తామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసులు తెలిపారు.అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని ఇప్పటి వరకు అధికారులు వెల్లడించకపోవడంతో ఈ విషయం పై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube