తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించడం ఇప్పుడు భారత్ – అమెరికాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.104 మంది భారతీయులతో కూడిన యూఎస్ మిలటరీ విమానం పంజాబ్లోని అమృత్సర్లో దిగిన సంగతి తెలిసిందే.అమెరికా( America ) నుంచి బహిష్కరించబడిన వారిలో 30 మంది పంజాబ్కు( Punjab ) చెందినవారు కాగా.33 మంది హర్యానా, మరో 33 మంది గుజరాత్లకు చెందిన వారు.ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు చండీగఢ్కు చెందినవారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇలా ఉన్నపళంగా భారతీయులను( Indians ) తరలించడంపై పలు ఎన్ఆర్ఐ సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి.ఈ వ్యవహారంపై పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( NRI Minister Kuldeep Singh Dhaliwal ) స్పందించారు.భారతీయులను బహిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) తక్షణం తన మిత్రుడు , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.ట్రంప్ నా స్నేహితుడని మోడీ పలుమార్లు చెప్పుకున్నారని.2019 సెప్టెంబర్లో అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తరపున మోడీ ప్రచారం కూడా చేశారని కుల్దీప్ సింగ్ ధాలివాల్ కోరారు.ఇవి అంతర్జాతీయ సమస్యలని, వాటిని ఆ స్థాయిలో చర్చించి పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అమృత్సర్ విమానాశ్రయంలో పలువురు బాధితులతో ధాలివాల్ మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బహిష్కరించబడిన వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ జరుగుతోందని , వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన మీడియాకు తెలిపారు.పంజాబ్కు చెందిన వారి డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని.
ఆ తర్వాత హర్యానా, గుజరాత్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ నిర్వహిస్తామని ధాలివాల్ చెప్పారు.వీరే కాకుండా అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీయుల మెడపై బహిష్కరణ , జైలు శిక్ష అనే కత్తి వేలాడుతోందని.
ట్రంప్తో మోడీ కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు.అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు దోహదపడిన వీరికి శాశ్వత నివాసం మంజూరు చేయాలని కుల్దీప్ సింగ్ చెప్పారు.