అమెరికాలో స్థిరపడిన కొందరు భారతీయులకి అరుదైన గుర్తింపు లభించింది.సుమారు ఐదుగురు భారతీయు గగ్గెన్ హీమ్ -2020 పురస్కారాలకి ఎంపిక అయ్యారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తులుగా గుర్తింపు పొందారు.ఆ వివరాలలోకి వెళ్తే.
అమెరికాకి వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వలస వాసులలో అత్యధికులు భారతీయులే ఉంటారు.
లక్షలాది మంది భారతీయులు అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడారు.
ముఖ్యంగా టెక్నాలజీ రంగాలలో మన భారతీయుల ప్రతిభ ఎవరితోనూ సరిపోల్చలేనిది.అంతేకాదు విద్యా, వైద్యం లాంటి పలు రంగాలలో సైతం భారతీయుల హవా ఇప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది.
మరీ ముఖ్యంగా అమెరికా రాజకీయాలలో సైతం భారతీయులు దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే భారత సంతతి ప్రజలకి పలు పురస్కారాలు, అవార్డులు, రివార్డులు కూడా అందుతూ ఉంటాయి.గగ్గెన్ హీమ్ -2020 పురస్కారానికి హ్యూస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్ శర్మ, బ్రౌన్ యూనివర్సిటీ గణిత శాస్త్రానికి చెందిన ప్రొఫెసర్ కవిత రమణ్ , హార్వర్డ్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న దిలీప్,మరో ప్రముఖ యూనివర్సిటీ లో ఎర్త్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా చేస్తున్న ముకుల్ శర్మ ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక అయ్యారు.173 మందిని ఈ పురస్కారాలకి ఎంపిక చేయగా నలుగురు భారతీయులు అందులో ఉండటం గమనార్హం.