స్టార్ హీరోలు హోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే సోషల్ మీడియా అస్సలు వదిలి పెట్టదు.
వారిని ట్రోల్స్ చేసి మరి ఏకిపారేస్తుంది.ఇక ఈ టెస్ట్ లో ఇప్పుడు బాలయ్య పాస్ అయినట్టే కనిపిస్తున్నాడు.
బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హాట్ గా చేస్తున్న షాట్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘.ఈ షో ఆహా ఓటిటి లో దీపావళి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే.
అసలు బాలయ్య ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద షో చేయడానికి ఒప్పుకున్నప్పుడే అందరు షాక్ అయ్యారు.ఎందుకంటే ఈ ఓటిటి సంస్థ పై మెగా ముద్ర పడిన విషయం తెలిసిందే.
అందుకే ఈ ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద షో చేయడానికి ఒప్పుకున్నాడని తెలిసి అందరు షాక్ అయ్యారు.ఈ విషయంలో బాలయ్యను ఒప్పించినందుకు అల్లు అరవింద్ ను మెచ్చుకోకుండా ఉండలేము.
ఆయన తెలివికి అందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఇక బాలయ్యను అంత కష్టపడి ఒప్పించి మరి షో చేయించడం వల్ల ఆహా సంస్థకు ఎంత కలిసి వచ్చిందో తెలుసా.! ఆహా ఓటిటి లో ఇప్పటికే చాలా షోలు వస్తున్నాయి.సమంత సామ్ జామ్, రానా నెంబర్ వన్ యారీ, ప్రదీప్ సర్కార్ వంటి టాక్ షోల వల్ల రాని ప్రయోజనం బాలయ్య షో వల్ల కలిగిందట.
దీంతో అల్లు అరవింద్ ఫుల్ ఖుషీగా ఉన్నాడట.
బాలయ్య షోలో మోహన్ బాబు మొదటి గెస్ట్ గా రావడంతో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది.ముందుగా వదిలిన టీజర్ తోనే అందరికి ఈ ఎపిసోడ్ పై ఆసక్తి కలిగింది.ఎందుకంటే బాలయ్య, మోహన్ బాబు మధ్య రాజకీయ అంశాలు కూడా రావడంతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ పై క్రేజ్ ఏర్పడింది.
దీంతో ఆహా సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారని సమాచారం.ఇక ముందు ముందు కూడా ఎవరు గెస్ట్ లు వస్తారు.వారితో బాలయ్య మాట్లాడే విధానం ఎలా ఉండబోతుందా అని అందరు ఆసక్తిగా ఉన్నారు.