తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోజు రోజుకు ఆశ పెరిగి పోతుంది.ఎన్నికల సమయంలో ఏ పార్టీనైతే ఆ పార్టీ తిట్టిందో.
ఇప్పుడు అదే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీతో దోస్తీకు సై అంటూనే మరో పక్క తమ ప్రాంతానికి నిధులు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది.ఇక విషయానికి వస్తే…ఎన్నో ఆశలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ వెళుతున్నారు.ఒకటి కాదు.
రెండు కాదు…ఒక పెద్ద కోర్కెల చిట్టాను జేబులో పెట్టుకుని తెలంగాణా కు వరాలు తెచ్చే క్రమంలో ఆయన డిల్లీకి బయలు దేరుతున్నారు.ఇక ఆయన చీటీలోదాగున్న వాటిల్లో ప్రాణహిత -చేవెళ్ల కు జాతీయ గుర్తింపు, ఇతర రాయితీల గురించి పక్కన పెడితే…ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే కోర్కె కూడా ఉందని సమాచారం.
మరి ఇప్పటికే విభజన చట్టంలో ఉన్న అంశాలనే అమలు చేయడానికి కేంద్రం ఆపసోపాలు పడుతోంది.స్వయంగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ లో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు.
దానిని తామే సాధించామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పలుమార్లు చెప్పుకున్నారు.అలాంటిది ఇప్పుడు హోదా లేదన్న స్పష్టమైన సంకేతం పంపించారు.
అలాగే వెనుకబడిన ప్రాంతాలకు కేవలం 350 కోట్ల ప్యాకేజీతో సరిపెట్టారు.ఇప్పుడు కెసిఆర్ వెళ్లి ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఇస్తారా.
అయినా కేసీఆర్ ది ఉపయోగం లేని డిమాండ్.అయితే ఇందులో తెలంగాణకు కలిసి వచ్చే అంశం ఏంటి అని అంటే.
వారికి రాకపోయినా ఆంధ్రకు ఇచ్చే అవకాశం లేకుండా అడ్డుగా ఉండవచ్చు.