చాలామంది పడుకునే ముందు పుస్తకాలు( Books ) చదువుతూ ఉంటారు.అయితే పుస్తకాలు చదివితే ఆలోచన విధానం మాత్రమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.
ఒక్కో పుస్తకం ఒక్కో మార్గదర్షి గా పనిచేస్తోంది.చాలా మంది పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నవారికి చదివే అలవాటు ఉంటుంది.
అయితే పుస్తకాలు చదివితే ( read books )చాలా మంచిది.ఇక చాలామంది పగలంతా పని చేసి రాత్రి ఒత్తిడికి గురవుతారు.
ఏ పని చేయాలన్న అస్సలు పనిచేయలేక పోతారు.ఇలా అనిపించినప్పుడు పడుకునే ముందు పుస్తకం చదవడం చాలా మంచిది.
కేవలం ఒక్క రెండు నిమిషాల పాటు పుస్తకాన్ని చదివినా ఒత్తిడి 68 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.
ఎక్కువగా పుస్తకాలు చదివితే సమాచారం పొందవచ్చు.
అంతేకాకుండా దీని వలన మనకు జ్ఞానం కూడా పెరుగుతుంది.అలాగే విభిన్న ఆలోచనల గురించి సమాచారం తెలుసుకున్న కొద్ది మనకు తెలివితేటలు( Intelligence ) పెరుగుతాయి.
మనకు సమాచారం తెలిస్తే ఇలా వీలైనంత ఎక్కువ నాన్ ఫిక్షన్ చదవాలి.ఫిక్షన్, ఫాంటసీ కథనాలు( Fiction and fantasy stories ) మీ పద జలాన్ని మెరుగుపరుస్తాయి.
అలాగే మీకు గొప్ప గొప్ప పదాలు కూడా తెలుస్తాయి.మీరు పరిజ్ఞానంలో ఉన్నట్లయితే మీరు ఇంటికి వచ్చినప్పుడు వీలైనంతవరకు మీ దృష్టి మరల్చడానికి ప్రయత్నించాలి.
పుస్తకం చదవడం ద్వారా మెదడు, మనసు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.ఇంకా బిజీ లైఫ్ లో నుంచి బయటపడాలి అంటే ఒక పుస్తకం చదవాలి.

అలాగే ఇష్టమైన పుస్తకంతో కూర్చుంటే మన ప్రపంచం మొత్తాన్ని మర్చిపోవచ్చు.పెద్ద శబ్దాలు, డ్రామాలు, టీవీల్లో, మొబైల్లలో హింసాన్ని అనుభవించాల్సిందే.అయితే పుస్తకంలో మాత్రం అందులోని కథల నుంచి మనకు మనసులో ఒక చిత్రాన్ని రూపొందించుకుంటాం.దీంతో మనకు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది.దీని వలన మీకు ఊహించే శక్తి పెరుగుతుంది.పుస్తకం చదవడం వలన మనకు హీరో లక్షణాలు కూడా వస్తాయి.

కష్టాల్లో ఉన్న వారికి మనం సహాయం చేయాలని భావిస్తాం.దీని ద్వారా మనకు తెలియకుండానే కొన్ని మార్పులు అభివృద్ధి చెందుతాయి.ఇక చాలామంది రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్( Mobile phone ) చూస్తూ పడుకుంటారు.అయితే మొబైల్ ఫోన్ లో చూడడం వలన కళ్ళపై ప్రభావం పడుతుంది.
అయితే ఈ మొబైల్ ఫోన్ కు బదులుగా ఒక పుస్తకం చదివి పడుకుంటే కంటికి కూడా మంచిది.అలాగే ఏకాగ్రత శక్తి పెరుగుతుంది.