కొన్ని పనులు చేస్తే మనకు చేటు కలుగుతుందని తెలిసినా, వాటిని చేయకుండా ఉండలేం.ఫలితంగా మనకు నష్టం జరుగుతుంటుంది.
ముఖ్యంగా అలవాట్ల విషయంలో ఇది జరుగుతుంటుంది.సిగరెట్లు తాగితే ఊపిరి తిత్తులు, గుట్కాలు తాగితే ఇతర అవయవాలు పాడైపోతాయని తెలిసినా చాలా మంది తమ అలవాట్లు మార్చుకోలేరు.
క్రమంగా వారి ఆరోగ్యం పాడవుతుంటుంది.ఉండేకొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి.దగ్గడం,
దగ్గుతున్నప్పుడు కొన్ని సార్లు రక్తం పడడం వంటివి జరుగుతుంటాయి.డాక్టర్లను సంప్రదించగానే పరిస్థితి విషమించిందని చెప్పేస్తారు.అప్పుడు తమ అలవాట్లు ఎంత పని చేశాయో అప్పుడు అర్థం అవుతుంటుంది.అయితే దీనిపై ఓ స్కూలులో వినూత్న ప్రచారం చేపట్టారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వంటి అలవాట్లతో అనారోగ్యాలు వస్తాయని అందరికీ తెలుసు.
అయితే ఈ దురలవాట్లు వల్ల కొన్ని బహుమతులు ఉన్నాయని ఓ స్కూలులో వినూత్న ప్రచారం చేపట్టారు.స్కూలు గోడపై చక్కగా పెయింటింగ్ వేశారు.గుట్కాలు తినడం, సిగరెట్లు తాగడం వల్ల విలువైన బహుమతులున్నాయని, మొదటి బహుమతిగా క్యాన్సర్, 2వ బహుమతిగా కిడ్నీల వ్యాధులు, 3వ బహుమతిగా గుండె జబ్బులు వస్తాయని రాశారు.
అంతేకాకుండా పళ్లు రంగు మారిపోవడం, క్షయ, గొంతుకు సంబంధించిన వ్యాధులు, కడుపులో అల్సర్లు వంటివి అదనంగా ఉంటాయని పేర్కొన్నారు.ఈ బహుమతులను అందిచే వేదికగా స్మశానం, కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యముడు, అధ్యక్షుడుగా కాటి కాపరి ఉంటారని వెల్లడించారు.సాధారణంగా ఏదైనా చెబితే ఎవరికీ అర్ధం కాదు.
దీంతో ఇలా వెరైటీ ప్రజలకు వాటి వల్ల అనర్ధాలు తెలిసేలా స్కూలు యాజమాన్యం ప్రయత్నించింది.వీరి వినూత్న ప్రచారంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.