కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం.విచారణ విషయంలో జాప్యం చేశారని అభిప్రాయ పడింది.
అంతేకాకుండా జనార్థన్ రెడ్డిపై నడుస్తున్న కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈనెల 29 లోగా విచారణను ముగించాలని తెలిపింది.
ఇకపై వాయిదాలు ఇవ్వవద్దని స్పష్టం చేసింది.