పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారు.పవన్ జనసేన పార్టీని ఏపీలో బలోపేతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా నరసాపురంలో బహిరంగ సభను నిర్వహించిన పవన్ కళ్యాణ్ జగన్ కు చిరంజీవి దండం పెట్టడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.టికెట్ రేట్ల వివాదం గురించి పవన్ మరోసారి పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు.
టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించడం కొరకు కొన్నిరోజుల క్రితం స్టార్ హీరోలతో కలిసి చిరంజీవి జగన్ ను కలవడం జరిగింది.ఆ సమయంలో జగన్ కు చిరంజీవి దండం పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వీడియో గురించి నెగిటివ్ కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి.
చిరంజీవి అలా చేయడం గురించి పవన్ స్పందిస్తూ జగన్ గారు పెద్దలు అని ఎంత పెద్దవాళ్లైనా తమకు సాయం చేయాలని ఆయన వద్దకు వెళ్లాలని పవన్ అన్నారు.
అలా వెళితే మాత్రమే సీఎం జగన్ అహం సంతృప్తి చెందుతుందని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.అందరూ దేహీ అనాలని వైసీపీ వాళ్ల ఆలోచన అంటూ పవన్ చెప్పుకొచ్చారు.వైసీపీ వాళ్లు రాచకరికంతో వ్యవహరిస్తే ఏ విధంగా ఊరుకుంటామని పవన్ కామెంట్లు చేశారు.
ఎవరి దగ్గరా డబ్బులు ఉండకూడదని వైసీపీ వాళ్ల ఆలోచన అని పవన్ అన్నారు.సాయం చేయాలని వెళితే తన దగ్గర అందరూ తగ్గారనే తృప్తి జగన్ కు కలుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు.
కొత్త టికెట్ రేట్లు అమలులోకి వచ్చే సమయంలో పవన్ చేసిన కామెంట్ల వల్ల టికెట్ రేట్ల జీవో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ చేసిన కామెంట్ల గురించి వైసీపీ నేతలు లేదా చిరంజీవి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.