న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా సినిమా శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.
సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా జనాల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను హీరో నాని వెల్లడించాడు.ఇంతకీ తను ఈ సినిమా గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం.
ఈ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు నాని వెల్లడించాడు.పీరియాడికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు చెప్పాడు.
సినిమా ఫైనల్ కాపీ చూశాక.ఈ సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం తనకు బాగా పెరిగిందన్నాడు.
సినిమా అద్భుతంగా వచ్చిందన్నాడు.సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీ తప్పదన్న నానీ.సినిమా బాగుంటే జనాలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పాడు.
అటు ఎంసీఏతో సాయిపల్లవి తనకు మంచి స్నేహితురాలైందన్నాడు.సాయి పల్లవి తన ఇంట్లో మనిషిలా ఉంటుందని చెప్పాడు.
ఈ సినిమాలో తను చేసిన మైథిలి పాత్రకు తను 100 శాతం న్యాయం చేసిందని చెప్పాడు.ఈ సినిమాలో కీర్తి పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
అందుకే కృతిని తీసుకున్నట్లు వెల్లడించాడు.
అటు ఈ సినిమాలో బెంగాలీ యువకుడిలా కనిపిస్తానని చెప్పాడు .ఈ గెటప్ కోసం క్యారవ్యాన్ లోకి వెళ్లి రెడీ అయి వచ్చినట్లు చెప్పాడు.అయితే సెట్ లో ఈ విషయం ఎవరికి తెలియదన్నాడు.
బయటకు రాగానే ప్రొడక్షన్ మేనేజర్ నన్ను చూసి పక్కకు వెళ్లినట్లు చెప్పాడు.నేను మాట్లాడితే అప్పుడు గుర్తుపట్టి.
సార్ మీరా అంటూ ఆశ్చర్యపోయాడని వెల్లడించాడు.
ఆ గెటప్ అందరికీ నచ్చిందని చెప్పాడు.అటు ఈ సినిమా కోసం సుమారు 6.5 కోట్లు పెట్టి కోల్ కతా సెట్ వేసినట్లు చెప్పాడు.వర్షాలతో దెబ్బతింటే.మళ్లీ వేసినట్లు చెప్పాడు.ఈ సినిమాలో తనవి అన్నీ.తెలుగులోనే డైలాగులు ఉంటాయని.
అక్కడక్కడ బెంగాళీవి వినిపిస్తాయని చెప్పాడు నానీ.