ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని.ప్రధాన పార్టీల నేతలు అనేక సందర్భాలలో వ్యాఖ్యానించడం తెలిసిందే.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు ఏమీ లేవు అని.వ్యాఖ్యానించి అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఓకే చెప్పడం జరిగింది.ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుఅని,వైసీపీ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ తో పాటు విభజన హామీలన్నీ న్యాయబద్ధంగా రాబట్టుకుంటాం అని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ విభజన హామీల విషయంలో నోరెత్తని పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా సి.బి.ఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ…స్పెషల్ స్టేటస్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే దిశగా నీతి అయోగ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు.
దీంతో ఏపీకి ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘం అడ్డమే కాదని ఈ విషయం తో నిరూపితమైందని తెలిపారు.అంతేకాకుండా ఈ విషయం పై సీఎం జగన్ తో పాటు మిగతా పార్టీల నేతలు దృష్టి సారించాలని సూచించారు.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు.