అంత‌ర్గ‌త స‌ర్వేల‌తో టెన్ష‌న్ పుట్టిస్తున్న బాబు.. టార్గెట్ ఎవ‌రు..?

2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత టీడీపీని ఉనికిలో లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.కానీ అదేసమయంలో ఎలాగైనా సరే 2024లో అధికారంలోకి రావాలని టీడీపీ యోచిస్తోంది.

 Babu Is Creating Tension With The Internal Surveys Who Is The Target , Chandrab-TeluguStop.com

ఇటీవల అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు శపథం కూడా చేశారు.మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని లేకపోతే అసెంబ్లీ గడప తొక్కనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీకి 2024 సాధారణ ఎన్నికలు చాలా క్లిష్టంగా మారాయి.ఎలాగైనా సరే గెలిచి తమ సత్తా చాటాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీని తట్టుకుని నెగ్గడం అంటే మామూలు విషయం కాదని అందరికీ తెలుసు.టీడీపీ ప్రస్తుతం వార్డుల్లో కూడా గెలవలేక చతికిల పడిపోతుంది.

అటువంటిది ఏకంగా అసెంబ్లీలో అడుగు పెడతారా? అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సందేహాలు ఎలా ఉన్నా కానీ పార్టీ సీనియర్ నేత చంద్రబాబు మాత్రం క్యాడర్ లో ఉత్సాహం పెంచేందుకు, 2024లో గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ఇటీవల ఆయన పార్టీలోని పరిస్థితులపై ఓ అంతర్గత సర్వే చేపిస్తున్నారని టాక్ నడుస్తోంది.పార్టీ పేరు చెప్పుకుని సరదాలు చేసే వారు, పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోని వారు, పార్టీలో పదవులు అనుభవిస్తూ వైసీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వారు ఎవరా? అని ఈ సర్వే టీం ఆరాలు తీస్తోంది.ఇందుకు అనుగుణంగానే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నాయకులను సస్పెండ్ చేశారు.వీరి సస్పెండ్ కు గల కారణాలు కూడా ఈ సర్వే ఫలితాలే అని తెలుస్తోంది.

కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా పార్టీలో అనేక మంది నేతలకు ప్రస్తుతం సర్వే టెన్షన్ పట్టుకుంది.ఏ సమయంలో ఏ విధంగా జరుగుతుందో అని కింది స్థాయి నేతలు భయం పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube