నాగబాబు కూతురు నిహారిక, చైతన్యల వివాహం మొన్న రాత్రి రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ లో ఘనంగా జరగగా ఈరోజు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరగనుంది.కరోనా నిబంధనల వల్ల పెళ్లికి పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరు కాగా రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ అభిమానులు హాజరు కానున్నారని తెలుస్తోంది.
నిహారిక పెళ్లి వేడుకకు పవన్ తో పాటు అకీరా నందన్, ఆద్యలు కూడా హాజరయ్యారు.
అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం నిహారిక చైతన్యల వివాహానికి హాజరు కాలేదు.
రేణు దేశాయ్ హాజరు కాకపోవడానికి కారణమేంటని ఆరా తీయగా నిహారిక పెళ్లి వేడుకకు ఆమెకు ఆహ్వానం అందిందని కొన్ని కారణాల వల్ల ఆమె వివాహ వేడుకకు హాజరు కాలేకపోయారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.స్వయంగా పెళ్లికూతురు నిహారిక రేణు దేశాయ్ ను ఆహ్వానించారని.
అయితే రేణు మాత్రం వెబ్ సిరీస్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రేణు దేశాయ్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ వెబ్ సిరీస్ పనులతో బిజీగా ఉన్న రేణు దేశాయ్ పెళ్లికి హాజరైతే పాత జ్ఞాపకాలు బాధ పెట్టే అవకాశం ఉందని భావించి పెళ్లికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.తను హాజరు కాకపోయినా కొడుకు అకీరా, ఆద్యలను మాత్రం ఆమె పెళ్లికి పంపించింది.
రేణు దేశాయ్ వ్యక్తిగత కారణాల వల్లే ఈ పెళ్లికి దూరంగా ఉందని సమాచారం.అయితే పెళ్లికి హాజరు కాని రేణు దేశాయ్ రిసెప్షన్ కు హాజరవుతారేమో చూడాల్సి ఉంది.అయితే నిహారిక పెళ్లిరోజున మాత్రం ఆమె వెబ్ సిరీస్ షూటింగ్ లోనే ఉన్నారని తెలుస్తోంది.