ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.నిత్యం 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక ఏపీలోని జైళ్లల్లో కరోనా కలవరం పెడుతుంది.చాల మంది ఖైదీలు, సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
అయితే ఇప్పటివరకు ఏపీలో 1,375 మంది ఖైదీలకు, 241 మంది జైలు సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్దారణ చేశారు.ఈ వైరస్ బారిన పడిన 380 మంది ఖైదీలు, 95 మంది జైలు సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.
అంతేకాక ఈ వైరస్ బారినపడి ఒక్క ఖైదీ, నలుగురు జైలు సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు.అంతేకాక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కడప జైలులోనే కరోనా బారినపడిన సంగతి విధితమే.
కరోనా సోకిన ఖైదీలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే వేరువేరు ఆసుపత్రుల నుండి ఐదుగురు ఖైదీలు పరారైయ్యారు.అంతేకాకుండా కరోనా కారణంగా కొత్త ఖైదీలను జైలులోకి అనుమతించడం లేదు.ప్రస్తుతం కొన్ని కేసులు ఎక్కువ అవుతుండడంతో జైల్లోకి అనుమతించక తప్పడం లేదు.
కొత్త ఖైదీల ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.వారానికి ఒక్కసారి ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహిస్తూ పోష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.