ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ ను భారత్ లో క్లినికల్ ట్రయల్స్ జరపనుంది.ఇప్పటికే బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ తో పాటు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలైన అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ట్రయల్స్ నిర్వహించనుంది.ఈ మేరకు పరీక్షలకు ముంబయి నగరంలో రెండు ఆస్పత్రులను కూడా సెలెక్ట్ చేసింది.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించి ముంబాయి నగరంలో రెండు హాస్పిటల్స్ వాలంటీర్లకు టీకాలను ఇవ్వనున్నట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది.బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికాతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ ను తయారు చేసింది.
మన దేశంలోనే రెండు, మూడు దశల్లో ప్రయోగాలు చేయనుంది.ఆరోగ్యవంతులైన వాలంటీర్లను సెలక్ట్ చేసుకుని ప్రయోగం స్టార్ట్ చేయనుంది.రెండు వారాల వ్యవధిలో వారికి రెండు వ్యాక్సిన్ డోసులను ఇవ్వనున్నారు.డోసులు ఇచ్చిన 58వ రోజు తర్వాత వ్యాక్సిన్ సురక్షితమా.
శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుందా లేదా అని విశ్లేషించనున్నారు.ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి భారత ఫార్మా దిగ్గజం సీరమ్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
వీటిలో సగం వరకు భారతీయలకే అందించనుంది.ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.250-300 వరకు ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.