బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి స్టార్ హీరోయిన్ “కంగనా రనౌత్” ఈ సారి మరోమారు బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక అతడికి ప్రధానం చేసినటువంటి పద్మశ్రీ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాలంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
గతంలో పలు మార్లు కరణ్ జోహార్ తనని బాలీవుడ్ సినిమా పరిశ్రమని వదిలిపెట్టి పోవాలని బెదిరించాడని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది.అంతేగాక కరణ్ జోహార్ సినిమా పరిశ్రమలో నెపోటిజం కి పాల్పడుతున్నాడని ఇందులో భాగంగా నూతన నటీనటులు అవకాశాలు రాకుండా చేస్తున్నాడని విరుచుకు పడింది.
దీనికితోడు ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కరణ్ జోహార్ పరోక్షంగా కారణం అయ్యాడంటూ కొందరు ఆరోపిస్తున్నారు.దీంతో కరణ్ జోహార్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో సుశాంత్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ “తలైవి” అనే చిత్రంలో నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.
అలాగే బాలీవుడ్ లో దక్కడ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
.