కరీంనగర్ జిల్లా( Karimnagar District ) జమ్మికుంటలో కాంగ్రెస్ జనజాతర సభ( Congress Janajatara Meeting ) జరిగింది.ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైందన్న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, పాలమూరును కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఆరోపించారు.ఈ క్రమంలోనే సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించారన్నారు.
ఇక రానున్న ఫైనల్స్ లో బీజేపీ వాళ్లు సూరత్ కు పారిపోయేలా తీర్పు ఇవ్వాలని పేర్కొన్నారు.పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు.
కనీసం విభజన హామీలను కూడా మోదీ నెరవేర్చలేదని మండిపడ్డారు.పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును మోదీ ( Modi ) అవమానించారన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే బండి సంజయ్( Bandi Sanjay ) మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు.
అదేవిధంగా పదేళ్లు ఈ గడ్డకు బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు.అధికారం కోసం బీజేపీ శ్రీరాముడిని కూడా వదలడం లేదన్నారు.రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.