హీరోయిన్ రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ఇద్దరు గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటయ్యారు.
ఇకపోతే ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరి పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.అందులో భాగంగానే రకుల్, జాకీ భగ్నానీ ముందుగా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అందుకు గాను మిడిల్ ఈస్ట్ లో ఒక దేశాన్ని కూడా ఎంచుకున్నారు.అయితే అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రధాని మోదీ( Narendra Modi ) పిలుపునివ్వడం, వాళ్లు తమ వివాహ వేదికను ఇండియాకు మార్చుకోవడం ఇలా అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి.
అయితే ఇప్పుడు ఈ జంట గోవాలో రకుల్-జాకీ పెళ్లి చేసుకోబోతున్నారు విషయం తెలిసిందే.అయితే గోవాలోనే ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది.ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే, చాలామంది హీరోయిన్లలా జైపూర్ లేదా ఉదయ్ పూర్ లో చేసుకోవచ్చు.లేదంటే ఢిల్లీలో చాలా ప్రాంతాలు ఉన్నాయి.
కానీ ఈ జంట, గోవాను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందట.అదేమిటంటే రకుల్-జాకీల ప్రేమ గోవాలోనే చిగురించిందట.ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా వీళ్లు గోవాలోనే ఎక్కువ ప్రేమించుకున్నారట.
అందుకే సెంటిమెంట్ ప్రకారం, పెళ్లి కూడా గోవాలనే చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.చాలామంది సెలబ్రిటీ జంటల్లా వీళ్లు కూడా పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లడం లేదు.నిర్మాతగా తన చేతిలో ఉన్న ప్రాజెక్టు పూర్తిచేశాడు జాకీ( Jackky bhagnani )కానీ రకుల్( Rakul preeth singh ) చేతిలో మాత్రం 3 సినిమాలు ఉన్నాయి.
వాటిలో 2 సినిమాలకు ఆమె ప్రచారం చేయాల్సి ఉంది.అందుకే పెళ్లి తర్వాత తమతమ పనుల్లో బిజీ కాబోతున్నారు ఈ జంట.ఈ నెల్లోనే రకుల్-జాకీ పెళ్లి చేసుకోబోతున్నారట.