గత కొంతకాలంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విజయవాడ రాజకీయం ఎట్టకేలకు రాజీయేనామాతో ముగిసింది.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అలక పాన్పు మీద కూర్చున్న వంగవీటి రాధాకృష్ణ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేసేసారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపారు.గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు రాధా దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు.ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు వంగవీటి రాధా హాజరు కాకపోవడం గమనార్హం.
ఇటీవల ఘట్టమనేని ఆదిశేషగిరి రావు సైతం టికెట్ విషయంలో విభేదాలు రావడంతో వైసీపీకి రాజీనామా చేశారు.
అయితే వంగవీటిని పార్టీలో కొనసాగించేలా చూసేందుకు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన యత్నాలు ఫలించలేదు.తన రాజీనామా లేఖను వంగవీటి రాధా.పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపారు.
విజయవాడ సెంట్రల్ సీటును రాధ కోరుతుండగా … జగన్ మాత్రం విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని సూచించారు.దీంతో మనస్థాపం చెందిన రాధా పార్టీకి గుడ్బై చెప్పారు.
అయితే ఆయన ఏ పార్టీ లో చేరబోతున్నాడో అనే విషయంలో క్లారిటీ మాత్రం ప్రకటించలేదు.