జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ తీవ్ర కలకలం సృష్టించింది.గత ఆదివారం జరిగిన ఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా నలుగురు విద్యార్థులు కాపీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
కడప జిల్లాకు చెందిన విద్యార్థి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది.స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేశాడని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే జవాబు పేపర్ ను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ కు షేర్ చేశాడని సమాచారం.సికింద్రాబాద్ లోని ఎస్వీఐ సెంటర్ లో కాపీయింగ్ పాల్పడ్డారని సమాచారం.
కడప విద్యార్థి స్నేహితులను దిల్ సుఖ్ నగర్ లో అబ్జర్వర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఈ వ్యవహరంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.